యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Tue, Apr 23 2024 8:35 AM

అల్తాఫ్‌ మృతదేహం
 - Sakshi

నందలూరు (రాజంపేట) : నాగిరెడ్డిపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీ అరవపల్లి ఆర్‌ఎస్‌ రోడ్డులోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదురు వీధిలో నివాసం ఉండే సయ్యద్‌ అల్తాప్‌ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఎస్‌ఐ మహ్మద్‌ అబ్దుల్‌ జహీర్‌ సోమవారం మాట్లాడుతూ తండ్రి బాష సాహెబ్‌ మరణించడంతో తల్లీ, కొడుకు ఇద్దరూ ఓ ఇంట్లో ఉంటున్నారు. కాగా సయ్యద్‌ అల్తాప్‌ తరచూ తల్లితో గొడవపడుతుండడంతో ఆమె కుమారుడిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అల్తాప్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వేర్వేరు ఘటనల్లో

ఇద్దరు ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మదనపల్లె మండలం తట్టివారిపల్లె మదనపల్లె బైపాస్‌ రోడ్డు వెంగమాంబ సర్కిల్‌ వద్ద నివాసం ఉన్న రజక కార్మికుడు శివయ్య(63) లాండ్రీషాపు నిర్వహిస్తున్నా డు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్ర మంలో సోమవారం సాయంత్రం ఇంట్లోనే చీర తో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నంకు పాల్ప డ్డా డు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

● మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ దొనబైలు గ్రామానికి చెందిన విజయకుమార్‌ భార్య చంద్రకళ (20) కుటుంబ సమస్యల కారణంగా నెయిల్‌ పాలిష్‌ తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఉరి వేసుకుని

మహిళ ఆత్మహత్య

కాశినాయన : మండలంలోని వరికుంట్ల గ్రామానికి చెందిన వివాహిత జాగిరిమున్ని (36) తన ఇంట్లో ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. వారి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్నికి గత 18 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పీరావలితో వివాహమైంది. భర్త కువైట్‌లో పనిచేసేవాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆమె ఉరి వేసుకుని మృతిచెందింది. కాశినాయన ఏఎస్‌ఐ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కరెంటు షాక్‌తో

విద్యార్థినికి గాయాలు

మదనపల్లె : కరెంటు షాక్‌తో విద్యార్థినికి గాయాలైన సంఘటన సోమవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. కలిచెర్ల పంచాయతీ నత్తి ఒబన్నగారిపల్లెకు చెందిన శుక్లానాయక్‌, రోజా దంపతుల కుమార్తె బుక్కె రెడ్డిలక్ష్మి(8) స్థానికంగా మూడవ తరగతి చదువుతోంది. ఇంటి వద్ద ఆడుకుంటూ ఇంటి మెట్లపైకి ఎక్కుతుండగా పక్కనే ఉన్న 11 కెవి విద్యుత్‌వైర్లు తాకి కరెంటు షాక్‌తో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మృతిచెందిన మున్ని
1/1

మృతిచెందిన మున్ని

Advertisement
Advertisement