గుంటూరు మెడికల్ : ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ నేతలు బుధవారం గుంటూరు జీజీహెచ్కు రూ. 4 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆగస్టులో గుంటూరులో అసోసియేషన్ రాష్ట్ర సమావేశం విజయవంతంగా జరిగింది. అప్పటి నిర్ణయం మేరకు జీజీహెచ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ వైద్య విభాగాలకు ఈ మొత్తం ఇచ్చారు. సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విరాళంతో విద్యార్థుల కోసం ల్యాప్టాప్లను కొనుగోలు చేశామన్నారు. దాతలను అభినందించారు. సీనియర్ న్యూరాలజిస్ట్లు డాక్టర్ తారక్నాఽథ్, డాక్టర్ పమిడిముక్కల విజయలు ఆసుపత్రి అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. కార్యక్రమంలో న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉప్పుటూరి అరుణ కుమారి, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ గొట్టిపాటి బిందు నర్మద, డాక్టర్ భార్గవీ దేవి, డాక్టర్ చక్కా శివరామ కృష్ణ, డాక్టర్ వీరమ్మ పాల్గొన్నారు.
స్ట్రోక్ యూనిట్కు ఐఎస్ఓ స్టాండర్ట్ సర్టిఫికెట్
అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పేద రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్న గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగంలోని స్ట్రోక్ యూనిట్కు ఐఎస్ఓ స్టాండర్డ్ సర్టిఫికేషన్ లభించింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
ఇంటెలిజెన్స్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
నగరంపాలెం: ఇంటెలిజెన్స్ గుంటూరు డీఎస్పీగా కొసన సుధాకర్బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు శ్యామలానగర్లోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టాక జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించారు. సుధాకర్బాబు 1995లో ఎస్ఐగా చేరారు. 2010లో సీఐగా ఉద్యోగోన్నతి పొంది గుంటూరు రూరల్ ఎస్బీ, గుంటూరు అర్బన్ సీసీఎస్, మేడికొండూరు పీఎస్, ఇంటెలిజెన్స్, గుంటూరు రేంజ్ కార్యాలయంలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment