ఆపద వస్తే కాపాడండిలా.. | - | Sakshi
Sakshi News home page

ఆపద వస్తే కాపాడండిలా..

Published Fri, Sep 27 2024 3:14 AM | Last Updated on Fri, Sep 27 2024 3:14 AM

ఆపద వస్తే కాపాడండిలా..

మణుగూరు టౌన్‌: వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయే బాధితులను కాపాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ అన్నారు. తహసీల్దార్ల ద్వారా మత్స్య సొసైటీలకు అందజేసిన తెప్పలతో గురువారం మత్స్యకారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సాంబాయిగూడెం గ్రామపంచాయతీలోని పేరంటాల చెరువులో డెమో నిర్వహించారు. వరదల్లో కొట్టుకుపోయే బాధితుడిని జాలర్లు పట్టుకునే విధానంతో పాటు ధైర్యంగా తెప్పపై ఎక్కించి తరలించడంపై అశ్వాపురం, పినపాక, మణుగూరు మండలాల జాలర్లకు వివరించారు. కార్యక్రమంలో మత్స్య శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ నూరుద్దీన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అనిల్‌కుమార్‌, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, ఎంపీడీఓ తెల్లూరి శ్రీనివాసరావు, ఎంఈఓ స్వర్ణజ్యోతి, వీరస్వామి, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement