జీవితకాల గరిష్ఠాలను చేరిన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్‌@78,000 Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

జీవితకాల గరిష్ఠాలను చేరిన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్‌@78,000

Published Tue, Jun 25 2024 3:31 PM | Last Updated on Tue, Jun 25 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఆల్‌టైమ్‌హై చేరాయి. బ్యాంకింగ్‌ రంగ స్టాక్‌లు భారీగా పెరగడంతో మార్కెట్‌ సూచీలు లాభాలతో దూసుకుపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 184 పాయింట్లు పెరిగి 23,722 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 720 పాయింట్లు ఎగబాకి 78,061 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స​్‌ అండ్‌ సెజ్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌యూఎల్‌, నెస్లే, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement