కొనసాగుతున్న బుల్‌ జోరు.. నిఫ్టీ@24,030 Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న బుల్‌ జోరు.. నిఫ్టీ@24,030

Published Thu, Jun 27 2024 3:32 PM | Last Updated on Thu, Jun 27 2024 3:32 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఆల్‌టైమ్‌హైలో దూసుకుపోతున్నాయి. ఐటీ రంగ  రంగ స్టాక్‌లు, నిఫ్టీలో మేజర్‌ వాటా కలిగిన రిలయన్స్‌ భారీగా పెరగడంతో మార్కెట్‌ సూచీలు లాభాల్లోకి చేరుకున్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లోనూ మార్కెట్‌ సూచీలు లాభాల్లో కదలాడాలి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 24,036 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 572 పాయింట్లు ఎగబాకి 79,246 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఎల్‌ అండ్‌ టీ, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement