లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్‌ సూచీలు..నిఫ్టీ@24,123 Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్‌ సూచీలు..నిఫ్టీ@24,123

Published Mon, Jul 1 2024 3:31 PM | Last Updated on Mon, Jul 1 2024 3:31 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 24,123 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 443 పాయింట్లు ఎగబాకి 79,476 వద్ద ముగిసింది. డెరివేటివ్‌ మార్కెట్‌లో సుమారు 3.3 లక్షల లాంగ్‌ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. దాంతో మార్కెట్‌లు ఆల్‌టైమ్‌హై చేరుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్‌, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, మారుతీసుజుకీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ ఎం కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ అండస్ట్రీస్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement