ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Jul 2 2024 3:39 PM | Last Updated on Tue, Jul 2 2024 3:39 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,123 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 34 పాయింట్లు దిగజారి 79,441 వద్ద ముగిసింది. డెరివేటివ్‌ మార్కెట్‌లో సుమారు 3.3 లక్షల లాంగ్‌ కాంట్రాక్ట్‌లు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఐ, ఇతర పెద్ద ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పెరిగాక గరిష్ఠాల వద్ద అమ్మకాలకు సిద్ధమవుతారని చెబుతున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌, నెస్లే, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement