సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Published Fri, Nov 17 2023 3:40 PM

Today Stock Market Updates 17th November 2023 By Money Mantra - Sakshi

ఈ రోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 248.09 పాయింట్ల భారీ నష్టంతో 65734.39 వద్ద, నిఫ్టీ 43.80 పాయింట్ల నష్టంతో 19721.40 వద్ద ముగిసాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లోనే ముగిసాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, లార్సెన్ అండ్ టబ్రో సంస్థలు చేరాయి. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), బజాజ్ ఫైనాన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటివి నష్టాలు చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
Advertisement