రామచంద్రపురం: స్థానిక శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ 9వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ చాంపియన్ షిప్–2024 పోటీలను గురువారం రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ ప్రారంభించారు. ముందుగా పట్టణానికి చెందిన సాయిరాం కోలాటం బృందంచే నృత్య ప్రదర్శనతో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ రామచంద్రపురంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్కు బీజం వేసిన నిర్వాహకులను అభినందించారు. తానూ వారి కృషిలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. క్రీడా స్ఫూర్తితో అంతా ముందుకు సాగాలన్నారు. అనంతరం రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి స్మారకంగా జరుగుతున్న ఈ పోటీల్లో రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి 8 బాలికల జట్లు, 11 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. తొలిరోజు తూర్పుగోదావరి, కడప బాలికల జట్ల మధ్య పోటీ జరిగింది. ఎంపీ బోస్, మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గరికిపాటి సూర్యనారాయణమూర్తి, డాక్టర్ కోట సునీల్, జీవీ రావు, బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గన్నమని చక్రవర్తి, ఉపాధ్యక్షుడు జి.భూషణరావు, టెక్నికల్ కమిటీ చైర్మన్ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment