ఓడిన చోటే కూతురు గెలిపించింది! | Sakshi
Sakshi News home page

ఓడిన చోటే కూతురు గెలిపించింది!

Published Tue, Apr 23 2024 8:30 AM

కుమార్తె శ్రీ తేజస్వినికి స్వీట్‌ తినిపిస్తున్న 
తండ్రి ప్రభాకర్‌    - Sakshi

బిక్కవోలు: ఇంకా ఎన్నికలు జరగలేదు. ఓడినచోట కూతురు గెలిపించడం ఏమిటా అని అనుకుంటున్నారా? ఇది నిజం. అయితే ఎన్నికల్లో కాదు పదోతరగతి ఫలితాల్లో ఇది జరిగింది. సోమవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మండలంలోని కొంకుదురు గ్రామంలో కుక్కల శ్రీ తేజస్విని 556 మార్కులు సాధించి పాఠశాల మొదటి స్థానం కై వసం చేసుకుంది.

అయితే తన తండ్రి కుక్కల ప్రభాకర్‌ ఇదే పాఠశాలల్లో 1996 పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అప్పటి నుంచి కూలీ పనిచేస్తున్నా తన ఇద్దరు పిల్లలను చక్కగా చదివించాడు. అయితే 2022లో తన కుమారుడిపై ఆశలు పెట్టుకున్నాడు. కాని కుమారుడు తృతీయ స్థానం సాధించాడు. అప్పటి నుంచి కుమార్తె శ్రీ తేజస్విని మరింత శ్రద్ధ తీసుకోవడంతో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిందన్నాడు. తన కలను కూతురు సాకారం చేయడంలో పాఠశాల ఉపాధ్యాయులు సహకారం అందించారని ఆయన తెలిపాడు.

Advertisement
Advertisement