![అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/29/28rjc143-270088_mr-1719608403-0.jpg.webp?itok=fgOurxz_)
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో జరుగుతున్న పోటీల్లో ఎంపికై , అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. శుక్రవారం స్థానిక చెరుకూరి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జిల్లా ఉషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్ ఉషు చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. రౌతు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా తమ ప్రతిభను చాటి జాతీయ స్ధాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
ఉషూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఆదిశేషు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో జరిగే జాతీయ పోటీలకు పంపుతామని తెలిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు రాజమహేంద్రవరంలో జరగడం గర్వకారణంగా ఉందన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.సుందరం మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 112 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. రెండు రోజులపాటు జరిగే ఈ పోటీలు పది విభాగాల్లో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహారావు, సంయుక్త కార్యదర్శలు టి.శ్రీనివాసరావు, ఆర్.శివకుమార్, కోశాధికారి ఆర్.వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటేష్, నెక్కెళ్ళ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment