గండేపల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కేతవత్ స్వామి నాయక్, మామిళ్లపల్లి బాలగణేష్ కలసి ఒడిశాలో ఒక వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి చిలకలూరిపేట ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయించాలనే ఉద్దేశంతో గంజాయిని కొనుగోలు చేశారు. కొన్న గంజాయిని మోటార్ సైకిల్పై తరలిస్తుండగా గండేపల్లి గ్రామ శివారు హైవేపై వారిని పోలీసులు పట్టుకున్నారు. బ్యాగ్లో రూ.72,500 విలువైన 14.5 కిలోల గంజాయి, మోటార్ సైకిల్ను డిప్యూటీ తహసీల్దార్ దివ్యభారతి సమక్షంలో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment