కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్రెడ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్రెడ్డి పేరు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నరేందర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే ఆమోదించినట్లు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ పరంగా గుర్తులు లేనప్పటికి, పార్టీ మద్దతుతో అభ్యర్థులు పోటీపడుతారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నరేందర్రెడ్డితో పాటు, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్రావు తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరకు ఏఐసీసీ నరేందర్రెడ్డి అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ప్రకటించినందున ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులకు నరేందర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన చారిత్రాత్మక గెలుపుతో సోనియాగాంధీకి బహుమతి అందజేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment