‘రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీరు లేక ఎండుతున్నాను.. జలం పోసి కాపాడండి’ అంటూ ఓ చెట్టు ప్రాధేయ పడుతున్నట్టుగా జనగామ రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రుచిక(9వ తరగతి) రూపొందించిన ప్లకార్డు ఆలోచింపజేస్తోంది. ‘పైకి చూడు.. నేను ఎండిపోతున్నాను.. బాటిల్ వాటర్ పోయండి’ ప్లీజ్ అంటూ పాఠశాల ఆవరణలోని చెట్టుకు వేలాడదీసిన ప్లకార్డు తోటి విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా ఉంది. – జనగామ