తాడ్వాయి(ఎల్లారెడ్డి) : మండలంలోని నందివాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రపు నారాయణతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం ప్రభుత్వ సలహాదారుడు శభ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని వా రిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో తిప్పాపూర్ వాసులు..
భిక్కనూరు : మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. బీఆర్ఎస్ నేతలు కొండ మాస య్య, విజయ, పెద్దగౌడ్ స్వామి, బాలగౌడ్, వెంకటస్వామి, రవీందర్గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి పాల్గొన్నారు.