అశ్వవాహనంపై రామయ్య | Sakshi
Sakshi News home page

అశ్వవాహనంపై రామయ్య

Published Tue, Apr 23 2024 8:10 AM

- - Sakshi

ఇల్లందకుంట: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో

శ్రీరా మనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శేషం రామాచార్యులు, అర్చకుడు శేషం వంశీధరచార్యులు మంత్రోచ్ఛారణ మధ్య స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్‌, సురేందర్‌రెడ్డి,

కడారి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్‌, పెద్దికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement