కరీంనగర్టౌన్: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం నిరంతర కార్యక్రమాలు చేపడుతూ ము ందుకు సాగుతోందని ప్రజ్ఞాభారతి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ డి.నిరంజనాచారి అన్నారు. సేవా మహాయజ్ఞం, వికసిత్ భారత్ లక్ష్యం కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మేధావుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచంతోనే పోటీపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, గుగ్గిళ్లపు రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మాడ వెంకటరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి, దండు కొమురయ్య, నాయకులు వంగల పవన్, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment