ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్సీలు సంచరిస్తే సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్సీలు సంచరిస్తే సీజ్‌

Published Sat, Jul 6 2024 12:38 AM | Last Updated on Sat, Jul 6 2024 12:38 AM

-

శివాజీనగర: నగరంలోని 11 ఆర్‌టీఏ కార్యాలయాల పరిధిలో నిషేధించిన ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్సీలు రోడ్లపై కనిపిస్తే సీజ్‌ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. బైక్‌ ట్యాక్సీలతో ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌లకు డిమాండ్‌ పడిపోయింది. దీంతో వాటిపై ఆధారపడిన డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. బైక్‌ ట్యాక్సీలను నిషేధించాలని 2021లో ఆటో, ట్యాక్సీ వాహనాల డ్రైవర్లు, యజమానులు ధర్నాలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం బైక్‌ ట్యాక్సీలపై నిషేధం విధించింది. అయితే కొన్ని సంస్థలు అనధికారికంగా ఎలక్ట్రిక్‌ బైక్‌ ట్యాక్సీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు ప్రైవేట్‌ రవాణా వాహనాల సంఘం ఆధ్వర్యంలో గురువారం రవాణా శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. రవాణా కమిషనర్‌ యోగేశ్‌ను భేటీ చేసి తమ గోడు వెల్లబోసుకున్నారు. దీంతో ఎలక్ట్రానిక్‌ బైక్‌ ట్యాక్‌ ట్యాక్సీలు రోడ్లపై సంచరిస్తే సీజ్‌ చేస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement