ఎన్నికల్లో గెలుపే లక్ష్యం ●
● సీఎం, మంత్రుల భేటీ
శివాజీనగర: రాష్ట్రంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధనపై సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం నివాసం కృష్ణాలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఉప ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా గంభీరంగా తీసుకొని ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఎవరూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలను చేయాలని తెలిపారు.
మంత్రుల గైర్హాజరు
ఈ సమావేశంలో చాలా తక్కువ మంది మంత్రులు పాల్గొనడంపై సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు రోజుల నుండి సమాచారం ఇచ్చినా కూడా గైర్హాజరయ్యారని మండిపడ్డారు. వారికి సంజాయషీ నోటీసులు ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment