అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు | Sakshi
Sakshi News home page

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

Published Wed, May 8 2024 5:40 AM

-

భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని కళావేదికపై మంగళవారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. తెనాలికి చెందిన శ్రీలక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం నిర్వాహకురాలు, నాట్యాచారిణి ఎ.వెంకట లక్ష్మి శిష్యులు మహాగణపతి, నమఃశివాయ, అంబ నీరాజనం, అష్టలక్ష్మి వైభవం, జయ జయ దుర్గ, మార్కండేయ విజయం, అర్ధనారీశ్వరం హనుమాన్‌ చాలీసా వంటి అంశాలకు చక్కని ఆహార్యం, అభినయంతో నృత్యం చేశారు. అనంతరం ఆలయ అధికారులు కళాకారిణులకు తీర్థప్రసాదాలు అందజేసి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు.

Advertisement
Advertisement