గెలిచే సీట్లలో నాగర్‌కర్నూల్‌ ఒకటి.. | Sakshi
Sakshi News home page

గెలిచే సీట్లలో నాగర్‌కర్నూల్‌ ఒకటి..

Published Wed, May 8 2024 3:40 AM

గెలిచే సీట్లలో నాగర్‌కర్నూల్‌ ఒకటి..

బిజినేపల్లి: దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచే 400 సీట్లలో నాగర్‌కర్నూల్‌ కూడా ఒకటని కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి లోగనాథన్‌ మురుగన్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేయిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ఆర్నెల్లు కావస్తున్నా ఎంత అవినీతి జరిగిందో బయట పెట్టలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి కుటుంబమని.. అందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్‌ స్కాంలో జైలుకు వెళ్లిందని తెలిపారు. సోమశిల వద్ద రూ.2,400 కోట్లతో ఐకాన్‌ వంతెన నిర్మిస్తున్నామని, కొల్లాపూర్‌లో మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌కు బీజేపీ నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు రఘు, ముదిరాజ్‌ సంఘం జిల్లా నాయకుడు నిరంజన్‌ పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ దిలీపాచారి, బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మండల నాయకులు భూషయ్య, తిరుపతిరెడ్డి, నారాయణచారి పాల్గొన్నారు.

Advertisement
Advertisement