మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డీఎస్సీ–2024కు సంబంధించి ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో కొనసాగింది. మొత్తం 12 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. ప్రతి కేంద్రంలోనూ ఇద్దరు గజిటెడ్ ఉపాధ్యాయులు, ఒక జూనియర్ అసిస్టెంట్లను నియమించారు. ఈ మేరకు ఎస్ఏ తెలుగు–16 మంది, ఎస్ఏ హిందీ 8 మంది, ఎస్ఏ సోషల్ 16 మంది, ఎస్ఏ మ్యాథ్స్ 16 మంది, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 12 మంది, ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇద్దరు, పీఈటీ 8 మంది, మిగతా ఎస్జీటీలతో కలిపి మొత్తం 217 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో ఇద్దరిపై కోర్టు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి చీటింగ్ కేసు, మరొకటి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. వాటికి సంబంధించిన వెరిఫికేషన్ను నిలిపివేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని.. వాటికి కూడా వెరిఫికేషన్ను యథావిధిగా నిర్వహించి ప్రభుత్వానికి పంపిస్తామని డీఈఓ రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
● సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో ఆర్జేడీ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెరిఫికేషన్కు వచ్చిన అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. డిగ్రీ, బీఈడీ పూర్తయిన అభ్యర్థులు సంబంధిత యూనివర్సిటీల నుంచి కాన్వాకేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా పొందాలని సూచించారు. సకాలంలో వెరిఫికేషన్ పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్జేడీ వెంట బాలుయాదవ్, సూపరింటెండెంట్ శంభుప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment