దశదిన కర్మ స్నానానికి వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

దశదిన కర్మ స్నానానికి వెళ్లి..

Published Sun, Dec 17 2023 10:50 AM | Last Updated on Sun, Dec 17 2023 10:50 AM

రమేశ్‌  - Sakshi

రమేశ్‌

చెరువులో మునిగి వ్యక్తి మృతి

చేగుంట(తూప్రాన్‌): దశదిన కర్మ స్నానం చేసేందుకు చెరువులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి పడి మృతిచెందాడు. ఈ సంఘటన చేగుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన బక్క రమేశ్‌(28)కు మహేశ్‌ వరుసకు సోదరుడవుతాడు. ఇతని దశదిన కర్మ కోసం తాను బంధువులతో కలిసి ఊర చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. అలా వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు కాలు జారి నీట మునిగి లోపలికి జారుకుపోయాడు. బంధువులు వెంటనే తేరుకొని రమేశ్‌ను రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి బుజ్జి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరీశ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement