కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి తుది ఓటరు జాబితా సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ఓటర్ స్లిప్పులు ప్రతి ఓటరుకు చేరేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అలాగే మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వన్షి బుధవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. సమావేశంలో డీఆర్ఓ పద్మ, ఆర్డీఓలు రమా దేవి, జయచంద్రారెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ హర్దీప్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.