No Headline
నేటి కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లా ప్రజల ఆశలు
డోర్నకల్ – గద్వాల లైన్ అయ్యేనా
సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్ఎల్ఎస్ చేపట్టేందుకు గతంలో రూ.7.40 కోట్లు కేటాయింది. తప్ప విడుదల కాలేదు. ఈసారైనా అందుకు నిధులను కేటాయిస్తుందా?లేదా? చూడాలి. ఇక మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ను రూ.458.26 కోట్లతో చేపట్టేందుకు ఎప్పుడో ఆమోదించిన కేంద్రం 2023 బడ్జెట్లో రూ.35.35 కోట్లు కేటాయించింది. అందులో రూ.11.30 లక్షలు ఖర్చు చేసింది. 2024 బడ్జెట్లో పైసా ఇవ్వలేదు. విష్ణుపురం–జాన్పహడ్ 11 కిలోమీటర్ల రైల్వే లైన్, జగ్గయ్యపేట– మేళ్లచెరువు లైన్కు ఈసారైనా నిధులు ఇస్తుందా? లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment