అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు.. పది రోజుల క్రితం నాగ అనే క్తిపై గంజాయి బ్యాచ్ చేసిన దాడి ఘటనను మరువకముందే సింగ్నగర్లో జెమిని అనే మరో రౌడీషీటర్ రాబరీకి పాల్పడిన ఘటన స్థానిక ప్రజలను కలవరానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే..
దారిలో అడ్డగించి.. బ్లేడ్లతో బెదిరించి..
శాంతినగర్ ప్రాంతానికి చెందిన పులపాక శ్రీకాంత్ అనే యువకుడు అంబాపురంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంటాడు. మంగళవారం రాత్రి తన స్నేహితుడు ధీరజ్తో కలిసి సింగ్నగర్ ఎంకే బేగ్ స్కూల్ వైపునకు బైకుపై వెళ్తుండగా మల్లవరపు విజయ్కుమార్ అలియాస్ జెమిని అనే ఓ రౌడీషీటర్, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి వారిని అడ్డగించారు. మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నా ఇచ్చేయండి..మీమొబైల్ ఫోన్లు అక్కడ పెట్టి వెళ్లిపోండంటూ వారిని బెదిరించబోయారు. దీంతో శ్రీకాంత్, ధీరజ్ వారిని దాటుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా జెమిని తనజేబులో ఉన్న బ్లేడ్ను తీసుకొని వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో శ్రీకాంత్ ముక్కుపై, ధీరజ్ ఒంటిపై గాయాలయ్యాయి. కిందపడిపోయిన వారి జేబులోని రూ.600 నగదును తీసుకొని జెమిని, అతని ఇద్దరు స్నేహితు లు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల చొరవ తో బాధితులు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందేందుకు వెళ్లగా అక్కడి అవుట్ పోస్ట్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. జెమిని, అతని స్నేహితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బ్లేడ్తో ఇద్దరిపై దాడి
Comments
Please login to add a commentAdd a comment