మల్టీ డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మల్టీ డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం

Published Mon, Oct 28 2024 1:19 AM | Last Updated on Mon, Oct 28 2024 1:19 AM

మల్టీ

మల్టీ డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం

విజయవాడస్పోర్ట్స్‌:కల్నల్‌ సి.కె.నాయుడు ట్రోఫీ మల్టీ డే క్రికెట్‌ మ్యాచ్‌లు మూలపాడులోని ఏసీఐ మైదానంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, విదర్భ జట్లు ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు తలపడనున్నాయి. ముందుగా టాస్‌ గెలిచిన విదర్భ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 56.5 ఓవర్లకు 212 పరుగులు చేసి ఆలౌటయింది. బ్యాట్స్‌మెన్‌లు అశ్‌జిత్‌సింగ్‌ 103 బంతుల్లో 84 పరుగులు, ఎండీ ఫయాజ్‌ 100 బంతుల్లో 52 పరుగులతో రాణించారు. ఆంధ్రా బౌలర్లు సాకేత్‌రామ్‌ మూడు, శ్రీకర్‌ మూడు, సాకేత్‌రామ్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. ఆంధ్రా బ్యాట్స్‌మెన్‌లు తేజ 39, రేవంత్‌రెడ్డి 22 పరుగులు చేశారు. విదర్భ బౌలర్లు గణేష్‌ నాలుగు, జగ్‌జోత్‌ రెండు వికెట్లు తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మల్టీ డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం1
1/1

మల్టీ డే క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement