3న జిల్లా కార్యకర్తల సమావేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు):ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నవంబరు 3న విజయవాడ ఎంజీరోడ్డులోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సమావేశంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, రానున్న రోజుల్లో నిర్మాణాత్మకంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రస్తుతం విస్మరిస్తూ ప్రజలను ఎలా మోసగిస్తున్నారో కూడా ప్రజలకు తెలియచేసేలా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ఏడు నియోజకవర్గాల నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment