లక్ష్మీపురం: గుంటూరు బ్రాడీపేట శంకర్ విలాస్ సెంటర్ ఫ్లైఓవర్ త్వరితగతిన నిర్మాణం చేయాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. విజయవాడలోని సత్యనారాయణపురం ఈటీటీ సెంటర్లో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు, గుంటూరు, గుంతకల్లు, విజయవాడ డివిజన్ల ఎంపీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఆర్ఓబీ, ఆర్యూబీ, ఇతర సమస్యల సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ గుంటూరు బ్రాడీపేట శంకర్ విలాస్ సెంటర్ బ్రిడ్జి 1957లో కేవలం రెండు లైన్ల వెడల్పుతో నిర్మాణం చేయటం జరిగిందని, దాని జీవిత కాలం 65 సంవత్సరాలు పూర్తి అయి సురక్షితమైన స్థితిలో లేదని అన్నారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, ఆ వంతెన స్థానంలో కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పునఃనిర్మాణం చేయాలని కోరారు. అదే విధంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఉన్న రైల్వే సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి
రైల్వే జీఎం సమావేశంలో ప్రతిపాదన
Comments
Please login to add a commentAdd a comment