గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య
అచ్చంపేట: ప్రతి గురువు పవిత్రత కలిగి ఉండాలని, దేవుని చిత్తం ప్రకారం నడుచుకోవాలని ఉమ్మడి గుంటూరు జిల్లా పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య అన్నారు. మండలంలోని తాడువాయిలోని తిరుకుటుంబ దేవాలయంలో శుక్రవారం కోట రాజమోహనన్ గురుపట్టాభిషేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఏసుప్రభు సందేశాన్ని వినిపించారు. క్రీస్తు అడుగులో అడుగులు వేస్తూ విశ్వాసం కలిగి ఉండాలని, నిర్మలమైన మనస్సు కలిగి ఉండి దివ్యపూజలు సమర్పించాలన్నారు. దైవధ్యానంలో నివసించాలని పిలుపునిచ్చారు. దేవుని చిత్తం ప్రకారం నడుచుకుంటూ ప్రజలకు సహాయపడాలని అదే నిజమైన గురుజీవితం అని అన్నారు. కార్యక్రమంలో తాళ్లచెరువులు విచారణ గురువు పుట్టి అంతోను, రేపూడి రాయప్ప, కస్తాల జాను, కోప్పూరి ప్రకాష్, చింతపల్లి అబ్రహం, క్రైస్తవ విచారణ కన్యా సీ్త్రలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment