ఏఎన్యూ: నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన డిగ్రీ 5వ , 6వ సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా సీఈ ఎ. శివప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు నవంబర్ 2వ తేదీలోగా రీవాల్యుయేషన్, జవాబు పత్రాన్ని పర్సనల్ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా శ్రావణ్బాబు
గుంటూరు మెడికల్ : జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబును నియమిస్తూ గురువారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ శ్రావణ్బాబు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఫారెన్ సర్వీసులో మూడేళ్లు నుంచి పని చేస్తున్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా పని చేస్తున్న డాక్టర్ సుబ్బరాజు ఇటీవల కాకినాడకు బదిలీ అయ్యారు.
అండర్–17 వాలీబాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
వేజండ్ల(చేబ్రోలు): మండలంలోని వేజండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ –17 బాలబాలికల వాలీబాల్ జిల్లా జట్ల ఎంపికలు గురువారం జరిగాయి. జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల నుంచి 450మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ఎస్టీఎఫ్ సెక్రటరీ ఎం. రవి, బాపట్ల జిల్లా ఎస్టీఎఫ్ సెక్రటరీ కరీముల్లాతో వివిధ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. స్థానిక పీఈటీ వెంకటేశ్వరరావు ఎంపికలను పర్యవేక్షించారు. జిల్లా జట్టుకు ఎంపికై న విద్యార్థులు ఈ నెల 20న హిందూపూర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు దుస్తులను గ్రామ పెద్దలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక హైస్కూల్ హెచ్ఎం విజయశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment