
AP Elections Political Latest Updates Telugu
7:50PM, Jan 20, 2024
చంద్రబాబుపై తిరుగుబాటు చేసిన మాజీ ఎమ్మెల్యే సివెరి సోము కుటుంబ సభ్యులు
- చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు: సివెరి సోము కుమారుడు సురేష్
- చివరకు సీటు ఇస్తామని చెప్పి తమకు అన్యాయం చేశాడు..
- వచ్చే ఎన్నికల్లో టిడిపి రెబల్ గా పోటీ చేస్తా..
- తమ సత్తా చంద్రబాబుకు చూపిస్తా.
- పార్టీ కోసమే మా నాన్న చనిపోయారు..
- మా నాన్న చనిపోయిన సందర్భంలో ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పారు.. ఇవ్వలేదు
- 2024 లో ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదు..
- టిడిపిలో కష్టపడిన వారికి న్యాయం జరగదు..
- వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎలా గెలుస్తుందో చూస్తాం
- కష్టపడిన వారిని కాకుండా ఎవరో గొట్టం గాడికి సీటు ఇస్తే ఎలా ఊరుకుంటాం
- చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు
- చంద్రబాబువి మోసపూరిత మాటలు..
- అరకులో పార్టీని నిలబెట్టింది సివెరి సోము
- మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు
- మా కుటుంబాన్ని ఆదుకొని చంద్రబాబు మాకు సీట్ ఇస్తాడు అంటే నమ్మాము
- ఇక చంద్రబాబు మాయమాటలను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు.
- గిరిజన వ్యతిరేకి చంద్రబాబు
- అమాయకులైన గిరిజనులను మోసం చేయడం చంద్రబాబు మొదటి నుంచి అలవాటు
6:03 PM, Jan 20, 2024
విజయవాడ పశ్చిమ నీదా? నాదా?
- బెజవాడలో బీటలు వారుతున్న టీడీపీ జనసేన కూటమి
- పశ్చిమ సీటు కోసం రెండు పార్టీల మధ్య పంతం
- ఇప్పటికే జనసేన తరఫున బరిలో ఉన్న పోతిన మహేష్
- జనసేనకు కాకుండా టీడీపీకి కేటాయించాలంటూ ఆ పార్టీ నేతల ఒత్తిడి
- నారా లోకేష్ ను కలిసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న
- ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేశాను
- ఇప్పుడు పొత్తు అంటే ఎట్లా?
- మొన్నటి వరకు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న కేశినేని నాని
- నాని స్థానంలో ఇన్ఛార్జ్ నాకివ్వండి : బుద్ధా వెంకన్న
- విజయవాడ పశ్చిమ టికెట్ ఇవ్వాలని కోరిన బుద్ధా వెంకన్న
- తనకు టికెట్ ఇస్తే పార్టీ కోసం గట్టిగా పని చేస్తానన్న బుద్ధా వెంకన్న
- తెర వెనక పోతిన మహేష్కు వ్యతిరేకంగా సిద్ధమవుతోన్న గ్రౌండ్
5:23 PM, Jan 20, 2024
అదెలా కుదురుతుంది? పెనమలూరులో ఎలా ఇస్తారు?
- పెనమలూరు టీడీపీ ఇన్చార్జ్ బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
- టీడీపీలో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి చేరికపై వ్యాఖ్యలు
- పార్ధ సారధి పెనమలూరు నుంచి టీడీపీ టికెట్ ఆశించడం ఆయన ఛాయిస్
- ఐదేళ్ల నుంచి పార్టీ కోసం పెనమలూరులో కష్టపడ్డాను
- పార్థసారధి చేరికపై ఇప్పుడే నేనేం మాట్లాడను : బోడే ప్రసాద్
5:20 PM, Jan 20, 2024
బ్యాన్ ఎల్లో మీడియా : రోజా
- ఎల్లో మీడియా పై మంత్రి రోజా ఫైర్
- అంబేద్కర్ అంటే ఎల్లో మీడియాకు గౌరవం లేదు
- అంబేద్కర్ విగ్రహావిష్కరణను చూపించేందుకు మనసు రాలేదా?
- అంబేద్కర్ కు నిజమైన వారసుడు సీఎం జగన్
- ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలను బహిష్కరించాలి
- అంబేద్కర్ ను ఎల్లో మీడియా అవమానించింది
- కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియాను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు
- టీడీపీ, జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : మంత్రి రోజా
5:12 PM, Jan 20, 2024
ఏపీ వ్యవస్థ బెస్ట్
- హైదరాబాద్ : ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుంది
- ఏపీలో అధ్యయనం చేస్తాం : కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి
5:05 PM, Jan 20, 2024
ఇడుపులపాయకు షర్మిల
- షర్మిల ప్రయత్నాలు ఎంత వరకు?
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు షర్మిల
- కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా వైఎస్ఆర్ ఘాట్కు
- షర్మిలతో పాటు కేవీపీ, రఘువీరా రెడ్డి
- రేపు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల
- కడప ఎయిర్పోర్టుకు మాజీమంత్రి అహ్మదుల్లా
- జనసమీకరణ కోసం కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు
4:55 PM, Jan 20, 2024
బ్యాన్ ఎల్లో మీడియా : ఆదిమూలపు
- అంబేద్కర్ మహాశిల్ప ఆవిష్కరణ చారిత్రక ఘట్టం : మంత్రి ఆదిమూలపు సురేష్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎల్లో మీడియాకి, చంద్రబాబుకి బుద్ధి చెప్పడం ఖాయం
- ఆ కార్యక్రమాన్ని చూపించకపోవటం వివక్షాపూరిత అహంకారానికి నిదర్శనం
- విగ్రహావిష్కరణను కూడా రాజకీయం చేయడం ఎల్లో మీడియాకే చెల్లింది
- చంద్రబాబు తరహాలోనే ఎల్లో మీడియా అహంకారంతో వ్యవహరిస్తోంది : మంత్రి ఆదిమూలపు సురేష్
4:45 PM, Jan 20, 2024
చిన్నికు చురకలు
- టిడిపిపై, కేశినేని చిన్నిపై కేశినేని నాని విమర్శలు
- ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దు
- కాల్ మనీ గాళ్ల మాటలకు సమాధానం చెప్పను
- టిడిపి 60శాతం ఖాళీ అవుతుంది
- అవసరమైతే 100శాతం ఖాళీ చేయిస్తా
- లోకేష్ స్థాయి నా కంటే చాలా తక్కువే
4:30 PM, Jan 20, 2024
వంగాకు పచ్చపార్టీలోనే పొగ పెడుతున్నారా?
- బెజవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా పై పోస్టుల కలకలం
- సెంట్రల్ నియోజకవర్గం వాట్సప్ గ్రూపుల్లో రాధా టార్గెట్ గా సర్క్యులేట్ అవుతున్న మెసేజ్లు
- ఇవేనా రాధాను టీడీపీ నమ్మకపోవటానికి కారణాలు పేరుతో సర్క్యులేట్
- రాధాకు టీడీపీ సెంట్రల్ సీటు ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఇలా చేస్తున్నారని స్థానికంగా ప్రచారం
- సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారం పై రాధా వర్గం సీరియస్
- బోండా ఉమా వర్గమే ఇలా చేసి ఉంటారని రాధా అనుచరుల అనుమానం
4:13PM, Jan 20, 2024
సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?: మంత్రి కాకాణి
- చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని కోర్టులు చెప్పలేదు
- చంద్రబాబు తాను తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు
- స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు ఊరట లభించలేదు
- బాబుకు ఊరట వచ్చిందని ఎల్లో మీడియా ప్రచారం
- సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?
- చంద్రబాబును మించిన దొంగ రాష్ట్రంలో ఎవరూ లేరు
- చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఒంటరిగా ఎందుకు పోటీ చేయడం లేదు
- చంద్రబాబు రా కదలి రా అంటే ఎవ్వరూ రావడం లేదు
- చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు
- వ్యవసాయ రంగం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
- చంద్రబాబు ఏరోజైనా వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్నారా?
3:31PM, Jan 20, 2024
పసలేని చంద్రబాబు స్పీచ్లు
- అరకులో చంద్రబాబు సోది ప్రసంగం
- చంద్రబాబు ప్రసంగం వినలేక సభ ప్రారంభంలోనే వెళ్లిపోయిన టీడీపీ కార్యకర్తలు
- బాబు మాట్లాడుతుండగానే ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు..
- రోజు చెప్పిన సోది చెప్పడంతో చిరాకు పడ్డ టీడీపీ నాయకులు
3:10PM, Jan 20, 2024
చంద్రబాబు మండపేట రా.. కదలిరా సభకు కలసిరాని జన సమీకరణ
- జన సమీకరణ కోసం నియోజకవర్గాలకు బస్సులు పంపిన టీడీపీ నేతలు
- ఎంతసేపు ఎదురుచూసిన జనం రాకపోవడంతో ఖాళీగా వెను తిరిగిన బస్సులు
- పలుచోట్ల జనం కోసం నిరీక్షిస్తూ నిలిచిపోయిన బస్సులు
- టీడీపీ నేతలకు తలపోటుగా మారిన చంద్రబాబు సభ జన సమీకరణ వ్యవహారం
2:20PM, Jan 20, 2024
కేశినేని చిన్ని వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని నాని కౌంటర్
- బ్రోకర్ హౌస్ నడిపే వాళ్ళు, అక్రమ వ్యాపారాలు , కాల్ మనీ, లోఫర్,డాఫర్ గురించి నాతో మాట్లాడించొద్దు
- ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ తరువాత మాట్లాడుదాం
- ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దు
- గతంలో నాతో ఉన్న అనుచరులను నాతో రమ్మని పిలవలేదు
- ప్రజలు జగన్ వెంట ఉన్నారు
- నాయకుల పాత్ర తక్కువే ప్రజల పాత్ర ఎక్కువ
- రాజీనామా అనంతరం నా అనుచరులతో సమావేశం అనంతరం వైఎస్సార్సీపీలో చేరాలని అనుకున్నా
- సీఎం జగన్ .పిలుపుతో వెంటనే వైఎస్సార్సీపీలో చేరాను
- ఇప్పటికీ చెబుతున్న టీడీపీ 60% ఖాళీ అవుతుంది... అవసరం అయితే 100% ఖాళీ చేస్తా
- నా స్థాయి చంద్రబాబు స్థాయి
- లోకేష్ కూడా నా స్థాయి కంటే తక్కువే
- కాల్ మనీగాళ్ళ మాటలకు సమాధానం చెప్పను
01:55 PM, Jan 20, 2024
దొంగలంతా ఒకటవుతున్నారు: మంత్రి ఆర్కే రోజా
- గతంలో కళాకారులను ఎవరూ పట్టించుకోలేదు
- జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారు
- కళాకారులు ఈ విషయాన్ని గుర్తించాలి
- ఎన్నికల సమయంలో దొంగలంతా ఒకటవుతున్నారు
- పందుల్లా గుంపులుగా వస్తున్నారు
- ‘జనం మనిషి’కి అన్యాయం చేయాలని చూస్తున్నారు
- దొంగలకు బుద్ధి చెప్పాలంటే కళాకారుల ఆట.. మాట.. పాట కావాలి
- ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024) ...జగనన్న వన్స్ మోర్
- జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి
- చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పోయాడు
- జనాన్ని దోచుకుని హైదరాబాద్లో ఆస్తులు దాచుకున్నాడు
- మళ్లీ ఆ దొంగలొస్తే ప్రజలకు విద్య, వైద్యం, అన్నం దొరకదు
- హైదరాబాద్ నుంచి వచ్చి విషం చిమ్మి పోతున్నారు
- నానా లోకల్ పొలిటీషియన్ల గురించి మనం పట్టించుకోవద్దు
- జగనన్నకు మనం అండగా ఉండాలి
- అంబేద్కర్కు దేశంలో ఎవరూ ఇవ్వలేనంత గౌరవం జగనన్న ఇచ్చారు
- ప్రపంచమంతా జగనన్నను అభినందిస్తోంది
- పక్క రాష్ట్రాల వారు జగనన్న వంటి ముఖ్యమంత్రి తమకు లేరని బాధపడుపతున్నారు
- జిల్లాల వారీగా కళాకారులకు కార్డుల పంపిణీ చేస్తాం
- కళాకారులకు మేం పూర్తిగా అండగా ఉంటాం
01:46 PM, Jan 20, 2024
ఆలస్యంగా అరకు బయలుదేరిన చంద్రబాబు
- విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు
- విశాఖ ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో అనుకున్న సమయానికి బయలుదేరని చంద్రబాబు
- హెలికాప్టర్లో ఆలస్యంగా అరకు బయలుదేరిన చంద్రబాబు
- రూట్ క్లియరెన్స్ లేకపోవడంతో చంద్రబాబు హెలికాప్టర్ వెనక్కి రప్పించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు
- కాసేపు అనంతరం మళ్లీ అరకు బయలుదేరిన చంద్రబాబు
- కాసేపట్లో ‘రా కదలిరా’ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
01:40 PM, Jan 20, 2024
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై దళిత మహిళల ఆగ్రహం
- విజయవాడలో ఈనాడు ,ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేసిన దళిత మహిళలు
- అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు
- దళిత సంఘాలు ఆగ్రహం.. దళిత మహిళల ఆధ్వర్యంలో నిరసన
- విషపు వార్తలు ప్రచురించి పత్రికల విలువలు దిగజారుస్తున్నారు: కోటా సామ్రాజ్యం
- దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ విగ్రహాన్ని ఏరక్పాటు చేసిన ఘనత జగన్కే దక్కుతుంది
- దళిత, బహుజనుల బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్
- దళితులలో ఎవరైనా పుడతారా అంటూ దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు, టీడీపీ నేతలకు దళితులంటే చులకన
- రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు దళితులంతా ఏకమై మా ఓటుతో బుద్ధి చెబుతాం
01:09 PM, Jan 20, 2024
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై దళిత సంఘాల మండిపాటు
- అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును తట్టుకోలేకపోతున్నాయంటూ దళిత సంఘాల ఆగ్రహం
- అంబేడ్కర్ ఆశయాలను సాకారం చేస్తున్న వైఎస్సార్సీపీ
- ప్రభుత్వం దేశానికే గర్వ కారణంగా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేసింది
- నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారిపై పచ్చ పత్రికలను దహనం చేసిన దళిత సంఘాల నేతలు
- ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వాగిన చంద్రబాబు ఎక్కడ?
- నియామక పదవులను, చివరికి కాంట్రాక్టు పనుల్లోనూ ఎస్సీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచిన దళిత పక్షపాతి సీఎం వైఎస్ జగన్ ఎక్కడ?
- చంద్రబాబు, జగన్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
- ఈ విషయాన్ని ప్రజలంతా ఆలోచన చేయాలి
- ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణలు విష ప్రచారాలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు
- దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు
12:45 PM, Jan 20, 2024
టీడీపీ నేత అవినాష్ రెడ్డిపై కేసు నమోదు
- అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ నేత అవినాష్ రెడ్డితో పాటు మరో 7 మందిపై కేసు నమోదు
- గురువారం రాత్రి దళితులపై అవినాష్ రెడ్డితో పాటు కొంతమంది దాడి
- సుమో వాహనం ధ్వంసం చేసి ఇద్దరినీ గాయపరిచిన టీడీపీ రౌడీలు
- ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు
- ఐపీసీ 147, 148, 354, 384, 324, 323, 427, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
11:34 AM, Jan 20, 2024
నెల్లూరు: రేపు సూళ్లూరుపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర
- బస్సు యాత్ర ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
- నాయుడుపేటలోని విజయ గణపతి ఆలయం నుంచి బజారు వీధులు మీదుగా బస్టాండ్ వరకు సాగనున్న ర్యాలీ
- హాజరుకానున్న రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు
11:29 AM, Jan 20, 2024
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల దహనం
- అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై విషం కక్కిన ఈనాడు, ఆంధ్రజ్యోతి
- పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో నిరసన
- ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు.. పెత్తందారుల పక్షాన పని చేశాడు
- చంద్రబాబు హయాంలో దళితులపై అనేక దాడులు జరిగాయి
- సీఎం జగన్ పేదల పక్షాన అండగా నిలిచారు.
- సీఎం జగన్ పేదల పక్షాన అండగా నిలిచారు
- సీఎం జగన్ ప్రభుత్వం దళితులకు అండగా నిలబడటాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఓర్వలేకపోతున్నాయి
10:58 AM, Jan 20, 2024
ఈనాడు, చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్
- చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణకు భయం పట్టుకుంది
- వీరంతా కళ్లు లేని కబోదులు.. అందుకే అంతమంది జనం వచ్చినా కనబడలేదు
- చంద్రబాబు ముమ్మాటికీ దళిత ద్రోహే
- రామోజీ, రాధాకృష్ణలు.. ఎన్ని క్రేన్లు పెట్టి చంద్రబాబును లేపినా ప్రయోజనం లేదు
- అంబేద్కర్ను అవమానించేలా చంద్రబాబు పాలన సాగింది
- గుండెల నిండా అంబేద్కర్ను పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్
- అంబేద్కర్ను అణువణువునా నింపుకుని సీఎం జగన్ పాలన చేస్తున్నారు
- పేదలంతా సీఎం జగన్ వెంటే
10:49 AM, Jan 20, 2024
ఇవేం రోత రాతలు రామోజీ.. మంచి జరిగితే నచ్చదా?: మంత్రి వేణు
- ఈ సమాజం ఎదగకూడదనేదే ఈనాడు పత్రిక ఆలోచన
- చంద్రబాబుకు మద్దతుగా రాసేవన్నీ రోతరాతలే
- అమ్మ ఒడితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన
- ఈ సమాజానికి నీ రాతల వల్ల ఇచ్చే సందేశమేంటి రామోజీ
- చంద్రబాబు చెప్పే అబద్ధాలను రాయడమే నీ పనా..?
- 2024లో నీ రోత రాతలకు కాలం చెల్లుతుంది
- లక్షలాది మంది వస్తే తట్టుకోలేక తప్పుడు వార్తలు రాస్తావా?
- బాధ్యత మరిచి వార్తలు రాస్తున్న ఈనాడుని బహిష్కరించే రోజులు దగ్గర్లో ఉన్నాయ్
- ఈనాడు వార్తలు అంబేద్కర్ను అవమానించినట్లుగానే మేం భావిస్తున్నాం
- ఈనాడు పత్రిక తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి
10:04 AM, Jan 20, 2024
బాబు దగా.. సీఎం జగన్ న్యాయం
- విశాఖ మన్యాన్ని దగా చేసిన చంద్రబాబు నాయుడు
- 2014 లో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఇస్తూ జీవో నెంబర్ 97 విడుదల చేసిన టీడీపీ ప్రభుత్వం
- అరకులో భూగర్భ డ్రైనేజీ పనులు చేస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేసిన చంద్రబాబు
- పెదలబుడు గ్రామానికి బస్సు సదుపాయం కల్పిస్తానని కపట వాగ్దానం చేసిన చంద్రబాబు
- లంబసింగిని దత్తత తీసుకుంటానని ప్రకటించి పట్టించుకోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
- చింతపల్లి సభలో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బాక్సైట్ తవ్వకాల జీవో 97 ను రద్దు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి
- లంబసింగి లో టీడీపీ హయాంలో అర్ధాంతరంగా నిలిపివేసిన రిసార్ట్స్ పనులను పూర్తిచేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
09:32 AM, Jan 20, 2024
దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?
- హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి కితకితలు
- ఫ్లాష్బ్యాక్ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. ఫ్లాష్బ్యాక్ సరైన సమాధానం
- ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు?.
- గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.
- విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు
- కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్ జవహర్ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి పోటీ చేయించారు.
- ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు.
- వైఎస్సార్సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది.
- ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది
- అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను.. ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు సీఎం జగన్
- సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు.
- మంగళగిరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి, కదిరి సిద్ధారెడ్డి, ఎమ్మిగనూరు చెన్న కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన
సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్సీపీ జాబితా
- ఎస్సీలు- 21
- ఎస్టీలు -3
- బీసీలు- 17
- మైనార్టీలు- 4
- ఓసి - 13
10 లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో..
- బీసీలు -6
- ఎస్సీలు -2
- ఎస్టీ -1
- ఓసీ -1
- ఏపీ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17 (కేబినెట్లో 70 శాతం)
బీసీ మంత్రులు :
- బాబు పాలనలో-8
- జగన్ పాలనలో-11
ఎస్సీ మంత్రులు:
- బాబు పాలనలో-2
- జగన్ పాలనలో-5
- జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం)
- తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు
స్పీకర్
- బాబు పాలనలో-కోడెల (కమ్మ)
- జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ)
బీసీలకు రాజ్యసభ స్థానాలు
- బాబు పాలనలో-0
- జగన్ పాలనలో -4
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు
ఎమ్మెల్సీలు
- బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం )
- జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం)
- జగన్ హయాంలో మిగతావి..
13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో - 9 (69 శాతం)
14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో -12 (86 శాతం)
గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో -58 (69 శాతం )
137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులలో - 79 (58 శాతం)
నామినేటెడ్ డైరెక్టర్ పదవులు-280 (58 శాతం)
196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం)
7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం )
బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు
ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు
ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు
09:09 AM, Jan 20, 2024
టీడీపీలో అడుగడుగునా అవమానాలే: నల్లగట్ల స్వామిదాసు
- తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్లుగా సేవ చేసినా తనకు తీరని అన్యాయం జరిగింది
- తిరువూరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆవేదన
- చంద్రబాబు ఇటీవల తిరువూరు పర్యటనకు వచ్చినపుడు మాజీ ఎమ్మెల్యేగా తనకు కనీసం సమాచారం ఇవ్వలేదు
- తనకు సీఎం జగన్ రాజకీయ పునర్జన్మ ఇచ్చారు
- జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటా
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుర్తింపు ఇచ్చింది వైఎస్సార్సీపీయే
- విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం సీఎం మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం
08:32 AM, Jan 20, 2024
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ వాయిదా
- కౌంటరు దాఖలుకు సమయం కోరిన చంద్రబాబు తరఫు న్యాయవాది
- విచారణ ఫిబ్రవరి 12కి వాయిదా
- స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణను వాయిదా
- ఈ కేసులో 52 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు
- కంటి చికిత్స, ఇతర ఆరోగ్య సమస్యలున్నాయంటూ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
- చంద్రబాబుకు అక్టోబర్ 31న తాత్కాలిక బెయిల్
- ఆ తర్వాత నవంబర్ 20న తాత్కాలిక బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ ఆదేశాలు
- దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం
- నవంబర్ 21న సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
- బెయిల్ రద్దు పిటిషన్పై డిసెంబర్ 8న జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్చంద్రల ధర్మాసనం విచారణ
- జనవరి 19కి వాయిదా వేసిన విషయం తెలిసిందే
- దీంతో ఈ కేసు విచారణ శుక్రవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ల ధర్మాసనం ముందుకొచ్చింది
- స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఇటీవలే తీర్పు వచ్చింది
- అధ్యయనం చేయడానికి సమయం పడుతుందని.. కౌంటర్ దాఖలుకు సమయం కోరిన బాబు తరఫు న్యాయవాది
- దీంతో ఫిబ్రవరి 12వ తేదీకి విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం
08:14 AM, Jan 20, 2024
సీఐడీ విచారణకు టీడీపీ నేతలు
- దర్శకుడు రామ్గోపాల్వర్మపై రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ అనుచిత వ్యాఖ్యలు
- సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు విచారణ
- అమరావతి జేఏసీ నాయకులు శ్రీనివాసరావు దర్శకుడు రామ్గోపాల్వర్మపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు
- రామ్గోపాల్వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటన
- దీనికి అనుబంధంగా షేక్ ఫిరోజ్, బండి శివకేశవ ఘాటైన కామెంట్లు
- కేసు విచారణలో భాగంగా వారిద్దరిని కొన్ని గంటలపాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
- విచారణలో వారితోపాటు ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు.
08:03 AM, Jan 19, 2024
రేపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు
- నేడు ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఘాట్లో నివాళులర్పించనున్న షర్మిల
- ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న షర్మిల
- ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరణ
- తెలంగాణలో వైఎస్సార్టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించిన షర్మిల
- తన పార్టీ YSRTPని జనవరి 4, 2024న కాంగ్రెస్లో విలీనం
- ఆ తర్వాత చకచకా మారిపోయిన పరిణామాలు
- షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టేందుకు APCC చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజును పక్కనపెట్టిన కాంగ్రెస్
- ఇది జరిగిన మరుసటి రోజే షర్మిలను కాంగ్రెస్ పెద్దలు ఏపీసీసీ చీఫ్గా నియామకం
ఇదీ చదవండి: AP: పొలిటికల్ ట్రాప్లో షర్మిల
07:18 AM, Jan 20, 2024
రామోజీ ఏడుపు.. పింఛన్లపై వంచన రాతలెందుకు?
- సీఎం వైఎస్ జగన్ పాలన పెన్షన్ లబ్ధిదారులందరికీ రామరాజ్యమే
- చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో లబ్ధిదారులకు అష్టకష్టాలు
- అప్పట్లో నడవలేని స్థితిలో వృద్ధులు, దివ్యాంగులు క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షణ
- ఆ రోజులే స్వర్ణయుగంగా ఈనాడుకు కనబడిందా?
- ఒక ఇంటికి ఒకే పెన్షన్ అంటూ ఆదేశాలిచ్చిందే బాబు ప్రభుత్వం
- కానీ, రెండేసి పెన్షన్లు మంజూరు చేసినట్లు ఈనాడు పచ్చి అబద్ధాలు
- జగన్ పాలనలో వలంటీర్లు ఠంఛన్గా 1న ఇంటి వద్దే పంపిణీ
- సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే పెన్షన్లు మంజూరు
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా రూ.10 వేల చొప్పున మంజూరు
- గత 55 నెలల్లో 29.51 లక్షల మందికి పెన్షన్లు మంజూరు
- అయినా.. జగన్ విధానాలన్నీ బూటకమంటూ రామోజీ ఏడుపు
07:05 AM, Jan 20, 2024
రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది
- ఆయన కులపోడు సీఎంగా లేడనే విషం కక్కుతున్న రామోజీ
- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం
- దళితుల మేలు గిట్టని రామోజీ, బాబు, రాధాకృష్ణ : ఎంపీ నందిగం
- ఈనాడు అధిపతికి ప్రజలే బుద్ధి చెప్తారు: ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్
- ఈనాడు ప్రతులను తగలబెట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
అంబేడ్కర్ స్మారక చిహ్నాన్ని సీఎం @ysjagan ఏర్పాటు చేస్తే @ncbn జీర్ణించుకోలేకపోతున్నారు.
— YSR Congress Party (@YSRCParty) January 18, 2024
రూ. 400 కోట్లు పెడితే ఎందుకంత ఖర్చు అని @JaiTDP నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు.
అంబేడ్కర్ విగ్రహంపై చంద్రబాబు చేస్తున్న రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతాం.
-మంత్రి మేరుగ నాగార్జున… pic.twitter.com/OVbgz7xNAc
07:02 AM, Jan 20, 2024
భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్!
- బడుగుల భూముల్లో పచ్చగద్దల పాగా
- ప్రభుత్వ భూములూ హాంఫట్
- ఏజెంట్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులకు బెదిరింపులు
- అమరావతిలో చంద్రబాబు ముఠా అసైన్డ్ భూ దోపిడీ
- కారుచౌకగా సేల్డీడ్ల ద్వారా హస్తగతం
- మొత్తం రూ.5 వేల కోట్ల భూముల లూటీ
- టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్ భూములు సమిధలు
- ప్రభుత్వ భూములూ గల్లంతు
- చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతం
- ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్ భూములు
- రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు
- వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం
- సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలు
- దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు
బినామీల ద్వారా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు..
- నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి)
- నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
- పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
- గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
- దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
- ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
- రావెల కిశోర్బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి)
- తెనాలి శ్రావణ్కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే)
- గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు)
- మండల ఎస్ఎస్ కోటేశ్వరరావు (రియల్టర్)
- మండల రాజేంద్ర (రియల్టర్) టకేవీపీ అంజనీకుమార్ (రియల్టర్)
- దేవినేని రమేశ్ (రియల్టర్) టబొబ్బా హరిచంద్రప్రసాద్ (రియల్టర్)
- హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్)
- దోనేపూడి దుర్గాప్రసాద్ (రియల్టర్)
అసైన్డ్ భూదోపిడీలో నిందితులు
- ఏ1 : నారా చంద్రబాబు
- ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది
- సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్విత్ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్ఐఆర్ నమోదు.
పేదలు బాగుండాలని మనం ఇన్ని మంచి పనులు చేస్తుంటే.. అది ఈ పెత్తందార్లకు నచ్చట్లేదు.
— YSR Congress Party (@YSRCParty) January 19, 2024
-సీఎం వైయస్ జగన్#StatueOfSocialJustice#JaganannaForSocialJustice#DrBRAmbedkar#AndhraPradesh pic.twitter.com/sAfbnnITIt
06:55 AM, Jan 20, 2024
పెత్తందారీ పోకడలూ అంటరానితనమే: సీఎం జగన్
- కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేడ్కరే స్ఫూర్తి
- 77 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసి పోలేదు
- రూపం మార్చి.. బరి తెగించిన దురహంకారులు పెత్తందారులు
- పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా, సేవకులుగానే ఉండాలట
- చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు
- తెలుగు మీడియమే ఉండాలని అంబేడ్కర్ అన్నట్టు పెత్తందార్ల పత్రిక వక్రీకరణలు
- వారు పాటించే అంటరానితనానికి అబద్ధాలతో అందమైన మేకప్
- పేదల చదువులు, ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు
- మన 56 నెలల పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం
- మీ బిడ్డ ప్రభుత్వం గ్రామ గ్రామాన మార్పు తీసుకొచ్చింది
- 206 అడుగుల ఎత్తుతో ఘనంగా ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ ఆవిష్కరణ