బేస్తవారిపేట: పిచ్చి కుక్క దాడి చేసి ఎనిమిది మందిని గాయపరిచిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని సలకలవీడులో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన అన్నసముద్రం శ్రీనివాసులు, ఎన్.గంగమ్మ, శ్రీనివాసులు, కే జానయ్య, ఎన్.అంకయ్య, వై.వసుంధర ఆరుబయట పడుకుని నిద్రిస్తుండగా పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో అర్ధరాత్రివేళ కంభం పీహెచ్సీకి వెళ్లి వారంతా వైద్యం చేయించుకున్నారు. వారి కాళ్లు,చేతులకుతీవ్రగాయాలయ్యాయి.గురువారం మధ్యాహ్న సమయంలో ఆర్.కొత్తపల్లెకు చెందిన మరో ఇద్దరు కూలీలపైకూడాగ్రామంలో బోరు వేసే సమయంలో పిచ్చి కుక్క దాడి చేసి గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వీధి కుక్కల బెడద అధికంగా
ఉందని, అరికట్టాలని గ్రామస్తులుక ోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment