పొలంలోనే పోయిన ప్రాణం
మంచాల: వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుట్ల గ్రామానికి చెందిన పోలమోని సత్తయ్య (70) తన వ్యవసాయ పొలం వద్ద కూరగాయాల తోటలకు నీళ్లు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు కాళ్లు తగలడంతో షాక్వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
విద్యుత్ షాక్తో రైతు మృతి
Comments
Please login to add a commentAdd a comment