![మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/sadman1_mr-1738894274-0.jpg.webp?itok=r0GE38Gi)
మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు
● ప్రిన్సిపాల్ తిట్టాడనే కారణంతో షాద్నగర్లోని శాస్త్ర పాఠశాల భవనంపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి నీరజ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించగా, తోటి విద్యార్థులు గమనించి, అడ్డుకున్నారు.
● కుంట్లూరులోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నాగర్కర్నూలుకు చెందిన సౌమ్య (17) ఇటీవల తరగతి గదిలో ఫ్యానుకు ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది.
● చదువు ఒత్తిడి తట్టుకోలేక హైదర్నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న షాద్నగర్కు చెందిన విద్యార్థి కౌశిక్ రాఘవ (17) హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● పరీక్ష సరిగా రాయలేదనే కారణంతో జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఇటీవల పదో తరగతి విద్యార్థిని త్రిష ఆత్మహత్యకు పాల్పడింది.
Comments
Please login to add a commentAdd a comment