ధర్మ సంసత్‌లో చిలుకూరు అర్చకుడు | - | Sakshi
Sakshi News home page

ధర్మ సంసత్‌లో చిలుకూరు అర్చకుడు

Published Fri, Feb 7 2025 7:43 AM | Last Updated on Fri, Feb 7 2025 7:43 AM

ధర్మ సంసత్‌లో  చిలుకూరు అర్చకుడు

ధర్మ సంసత్‌లో చిలుకూరు అర్చకుడు

మొయినాబాద్‌: మహా కుంభమేళా ధర్మ సంసత్‌లో చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌ పాల్గొన్నారు. కుంభమేళాలో పవిత్రస్నానం ఆచరించిన ఆయన గురువారం ఉత్తరాణ్మాయా జ్యోతిష్పీఠం శంకర మఠానికి చెందిన అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ నిర్వహించిన ధర్మ సంసత్‌లో చిలుకూరు ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం ధర్మ పరిరక్షణకోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రామరాజ్య స్థాపన కోసం చిలుకూరు నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ అర్చ కుడు రంగరాజన్‌కు జ్ఞాపికను అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement