మెజారిటీపైనే దృష్టి పెట్టండి | Sakshi
Sakshi News home page

మెజారిటీపైనే దృష్టి పెట్టండి

Published Tue, May 7 2024 6:45 PM

మెజారిటీపైనే దృష్టి పెట్టండి

● కష్టపడిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ● మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి నాయకులు అహర్నిశలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హుస్నాబాద్‌లోని బీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌లో సోమవారం రాత్రి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికలకు కొన్ని రోజుల సమయమే ఉందని, ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రాజేందర్‌ రావు గెలిస్తేనే సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు గెలవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమన్నారు. బూత్‌లలో మంచి మెజార్టీ తెచ్చుకున్న వారికే రాజకీయంగా పదవుల్లో, అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్‌ కార్డులు, కొత్త ఫించన్లు ఇస్తామన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చెబుతున్న విధంగా రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు.

Advertisement
Advertisement