‘స్థానిక’ సమరానికి సమాయత్తం కావాలి
● మెదక్ ఎంపీ రఘునందన్రావు ● బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం
నంగునూరు(సిద్దిపేట): పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎంపీ రఘునందన్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నంగునూరులో బుధవారం చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈసందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని, నంగునూరుకు బస్సుల సంఖ్య పెంచాలని కోరడంతో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చెప్పారు. రైతు ఆగ్రోసేవా కేంద్రం పరిశీలించి ఎరువులు, రైతులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రఘునందన్రావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. నంగునూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్ర మం చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, సీనియర్ నాయకుడు విద్యాసాగర్రావు, పర్కాల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment