● వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి
కలిగిరి: ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉదయగిరి నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి విధాలా అభివృద్ధి చేస్తానని వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపాళెం, కావలిముస్తాపురం, క్రాకుటూరు, అనంతపురం పంచాయతీల్లో మంగళవారం ఆయన విజయ సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మరింత మేలు చేకూర్చేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చిదిద్దారన్నారు. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అమలు చేయలేని విధంగా కూటమి మేనిఫెస్టో ఉందన్నారు. ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మండలంలో అవకాశమున్న చెరువులకు సోమశిల జలాలు తరలించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పాలూరి మాల్యాద్రిరెడ్డి, మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి, ఎంపీటీసీలు హరిశ్చంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, నాయకులు మాలేపాటి వెంకటసుబ్బయ్య, మెట్టుకూరు భాస్కర్రెడ్డి, ఎంవీ రామిరెడ్డి, దేవిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, రాంజీవిరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.