No Headline
ఆత్మకూరు: ఇంటర్మీడియట్ చదివే మైనర్ అయిన దళిత బాలికను మాయమాటలతో మోసం చేసి, ఆమె కళాశాల చదువుకు ఆటంకం కల్పించి జీవితాన్ని అన్యాయం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకుడు పందిరి సుబ్బయ్య తదితరులు డిమాండ్ చేశారు. ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, తల్లిదండ్రులను ఆదివారం కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంగా చేస్తామని చెప్పారు. అనంతసాగరం మండలం కొత్తపల్లి దళితకాలనీకి చెందిన మైనర్ బాలికను లింగంగుంట గ్రామానికి చెందిన పెట్రోల్ బంకులో పనిచేసే హుస్సేన్ పెళ్లి చేసుకుంటానని, మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్న విషయం తెలిసిందే. బాలికతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె చదివే కళాశాలలలోని పలువురికి, గ్రామంలోని వారికి వాట్సప్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పందిరి సుబ్బయ్యతో పాటు ఆత్మకూరు నాగయ్య, బాబు, తదితరులు పాల్గొన్నారు.
బాధితురాలిని పరామర్శించిన ఆర్డీఓ
నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మైనర్ బాలికను ఆత్మకూరు ఆర్డీఓ బి.పావని ఆదివారం రాత్రి ఆత్మకూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి వెళ్లి పరామర్శించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా అధికారులతో మాట్లాడనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది, ఆసుపత్రి వైద్యులు ఉన్నారు.
బాధితురాలికి న్యాయం జరగకపోతే పోరాటం చేస్తాం
ఎంఆర్పీఎస్ నేతలు
Comments
Please login to add a commentAdd a comment