బాలికల వసతిగృహాలను తనిఖీ చేసిన జడ్జి | - | Sakshi
Sakshi News home page

బాలికల వసతిగృహాలను తనిఖీ చేసిన జడ్జి

Published Mon, Oct 28 2024 12:13 AM | Last Updated on Mon, Oct 28 2024 12:13 AM

బాలికల వసతిగృహాలను తనిఖీ చేసిన జడ్జి

బాలికల వసతిగృహాలను తనిఖీ చేసిన జడ్జి

బిట్రగుంట: కప్పరాళ్లతిప్పలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకులం, కావలిలోని ఎస్టీ బాలిక వసతిగృహాలను కావలి సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం శోభ ఆదివారం తనిఖీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వసతిగృహాల్లో విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. తాగునీటి సరఫరా, పరిసరాల శుభ్రత, మెడికల్‌ కేర్‌, విద్యాబోధన తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జడ్జి వెంట ప్రిన్సిపల్‌ పద్మావతి, లీగల్‌ ఎయిడ్‌ మెంబర్‌, న్యాయవాది సాయిప్రసాద్‌, లోక్‌అదాలత్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement