ఇంటిపై జెండా.. టీడీపీ నేతల దాడి | - | Sakshi
Sakshi News home page

ఇంటిపై జెండా.. టీడీపీ నేతల దాడి

Published Tue, Sep 10 2024 1:42 PM | Last Updated on Tue, Sep 10 2024 1:42 PM

ఇంటిపై జెండా.. టీడీపీ నేతల దాడి

వైఎస్సార్‌ సీపీ నేత ఇంటి అద్దాలు ధ్వంసం

రొద్దం: ఇంటిపై వైఎస్సార్‌ సీపీ జెండా కట్టాడన్న కారణంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ నాయకుడి ఇంటిపై దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే...మండల పరిధిలోని బీదానిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు కరుబ ప్రభాకర్‌ తన ఇంటిపై వైఎస్సార్‌ సీపీ జెండా కట్టుకున్నాడు. దీన్ని జీర్చించుకోలేని టీడీపీ నాయకులు సోమవారం ప్రభాకర్‌ ఇంటి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రభాకర్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో భయపడిపోయిన వారు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోగా..ఆగ్రహించిన టీడీపీ నేతలు ఇంటి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. తన ఇంటిపై దాడిచేసిన టీడీపీ నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ ఆస్తుల

జోలికొస్తే కఠిన చర్యలు

పుట్టపర్తి టౌన్‌: ప్రభుత్వ ఆస్తులకు ఎవరైనా నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అక్కడక్కడా కొంతమంది ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు కూల్చేందుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలన్నారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement