చవితి నాడు మంటపాల్లో కొలువుదీరి మూడురోజుల పాటు పూజలందుకున్న గణనాథుడు సోమవారం గంగఒడికి చేరాడు. పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర తదితర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం కమనీయంగా సాగింది. ‘గణబప్పా మోరియా’ ‘గణేష్ మహరాజ్కి జై’ అంటూ చిన్నాపెద్దా నృత్యాలు చేస్తూ పార్వతీ తనయుడికి శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లోని చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం కమనీయంగా సాగింది. ధర్మవరంలో నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ రత్న పర్యవేక్షించారు.
– సాక్షి బృందం
Comments
Please login to add a commentAdd a comment