లడ్డూ @ రూ.1.82 లక్షలు | - | Sakshi
Sakshi News home page

లడ్డూ @ రూ.1.82 లక్షలు

Published Tue, Sep 10 2024 1:42 PM | Last Updated on Tue, Sep 10 2024 1:42 PM

లడ్డూ @ రూ.1.82 లక్షలు

నల్లమాడ: వినాయకుడి లడ్డూ అంటేనే ప్రత్యేకం. అందుకే స్వామివారి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు రూ.లక్షలు వెచ్చించి వేలం పాడతారు. సోమవారం నల్లమాడ మండలం రాగానిపల్లిలో 15 కిలోల వినాయకుడి లడ్డూకు వేలం పాట నిర్వహించగా, ఆదినారాయణ అనే వ్యక్తి ఏకంగా రూ.1.82 లక్షలకు దక్కించుకున్నారు. రాగానిపల్లిలో గ్రామ కూడలిలో ఏటా చవితి రోజున వినాయకుడిని కొలువుదీర్చి...మూడో రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. నిమజ్జనం రోజున స్వామివారికి ప్రసాదంగా ఉంచిన లడ్డూ వేలం నిర్వహిస్తారు. ఈ సారి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు, ఎంపీటీసీ జయమ్మ భర్త ఆదినారాయణ దక్కించుకున్నారు. ఒక చిన్న గ్రామంలో వినాయకుడి లడ్డూ ధర లక్షకుపైగా పలకడంపై గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారూ ఆశ్చర్యపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement