కొత్తూరు: కొత్తూరులో వృద్ధ దంపతులు ఆస్పత్రిలో రోజంతా భోజనం చేయకుండా దీనంగా గడిపిన ఘటన స్థానికులను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరు మండలం నివగాంకు చెందిన గొర్లె బుగతమ్మ, నారాయణలను ఈ నెల 19న వారి కుమారుడు కొత్తూరు సీహెచ్సీ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతను నిత్యం మందు మత్తులోనే ఉంటాడు. తల్లిదండ్రులను తీసుకువచ్చి ఆస్పత్రిలో ఓపీ కూడా తీయలేదు. ఓపీ తీయాలన్న సంగతి ఆ వృద్ధ దంపతులకు కూడా తెలీకపోవడంతో ఆస్పత్రిలోని ఒకే మంచంపై ఇద్దరూ గురువా రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉన్నారు. నారాయణ కాలికి గా యాలై చీము పట్టి ఉంది. బుగతమ్మకు నడుం నొప్పి వస్తోంది. గురువారం రాత్రి అటుగా వచ్చిన డ్యూటీ డాక్టర్ వారి పరిస్థితి చూసి ఇంజెక్షన్ ఇచ్చారు. ఓపీ లేకపోవడం, ఎవరికీ స మాచారం లేకపోవడంతో వారిని ఎవరూ ప ట్టించుకోలేదు. దీంతో గురువారం నుంచి శు క్రవారం వరకు వారు కనీసం భోజనం కూడా చేయకుండా అక్కడే ఉండిపోయారు. వైద్యం కూడా అందలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి గురించి ‘సాక్షి’ విలేకరికి తెలియడంతో విషయాన్ని డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే అటెండెంట్ ఉంటే తప్ప వైద్యం అందించలేమని వైద్యులు చెప్పారు. చివరకు వృద్ధ దంపతుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నూలు వీరభద్ర స్వామికి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పడంతో ఆయన వృద్ధుల కుమారు డికి కబురు పంపించారు. అలాగే ఈ విషయం ఆస్పత్రి సూపరింటెండెంట్ ధర్మాన కిశోర్ దృష్టికి రావడంతో ఆయన కూడా వెంటనే నివగాంలో ఉన్న కుమారుడిని పిలిపించి మెరుగైన వైద్యం అందించి నారాయణకు శ్రీకాకుళం రిఫ ర్ చేశారు. చికిత్స ప్రారంభించే ముందు కొ త్తూరు ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కా ర్మికురాలు స్పందించి ఓపీ టిక్కెట్ తీసి దంప తులకు ఇచ్చి మానవత్వం చాటుకుంది.
టీచర్పై విచారణ
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు వై.వెంకటరమణపై వచ్చిన ఫిర్యాదులు, ఇతర అంశాలపై డిప్యూటీ డీఈఓ ఆర్.విజయకుమారి శుక్రవా రం పాఠశాలలో విచారణ నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశమై వారి నుంచి వివరాలు సేకరించారు. అలాగే గ్రామ పెద్దలు లక్ష్మణరా వు, ఎల్లయ్య, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ రవివర్మలతో చర్చించారు. జిల్లా విద్యా శాఖ అధికారికి నివేదిక అందజేయనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment