క్రెడిట్‌ కార్డు మోసాలపై జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డు మోసాలపై జాగ్రత్త

Published Sat, Sep 21 2024 12:50 AM | Last Updated on Sat, Sep 21 2024 12:50 AM

క్రెడిట్‌ కార్డు మోసాలపై జాగ్రత్త

శ్రీకాకుళం క్రైమ్‌ : అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి మీ క్రెడిట్‌ కార్డుపై చార్జీలు పడతాయని లేదంటే బ్లాక్‌ అవుతుందని బెదిరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసినా, మెసేజ్‌లు పంపినా స్పందించకూడదని, వ్యక్తిగత సమాచార గోప్యత పాటించాలని తెలిపారు. ఫోన్‌కు వచ్చే లింక్‌లు ఓపెన్‌ చేయకూడదని, ఆధార్‌, బ్యాంకు ఖాతాల సమాచారం, క్రెడిట్‌/డెబిట్‌ కార్డు / బ్యాంకు ఖాతా నంబర్‌, యూపీఐ పిన్‌, ఓటీపీ, సీవీవీ (కార్డ్‌ వెరిఫికేషన్‌ వాల్యూ) నంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌ తదితర వివరాలు ఎవరికీ చెప్పకూడదన్నారు. ఎవరైనా మోసపోతే 1930 నంబర్‌కు కాల్‌ చేయాలని, లేదంటే నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్‌.జిఒవి.ఇన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement