ఈ సారి వైరల్ ప్రభావం ఎక్కువగా ఉంది. మా ఆస్పత్రికొచ్చే ఓపీలో 100 మందిలో 60 మంది జ్వరపీడితులే ఉంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు ఎఫెక్ట్ అవుతున్నారు. సకాలంలో వైద్యం తీసుకుంటే ఇబ్బంది లేదు. అలసత్వం వహిస్తే కేసులు సీరియస్ అవుతున్నాయి. వైరల్ జ్వరాలకు ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. జ్వరం తగ్గిన వెంటనే మళ్లీ ప్లేట్లెట్స్ పెరుగుతాయి. ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యం చేసుకుంటే సమస్య ఉండదు. కాకపోతే ఈసారి జ్వరాలు వచ్చిన వారికి చికున్ గున్యా తరహాలో బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. జ్వరాల కన్నా అవే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. మందులు వాడుకుంటే సరిపోతుంది.
– తమ్మినేని వేణుగోపాల్, ప్రముఖ వైద్యులు, అమృత హాస్పిటల్, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment