నటి ఆత్మహత్య కేసులో భర్త నిర్దోషి | - | Sakshi
Sakshi News home page

నటి ఆత్మహత్య కేసులో భర్త నిర్దోషి

Published Sun, Aug 11 2024 1:22 AM | Last Updated on Sun, Aug 11 2024 12:15 PM

నటి ఆత్మహత్య కేసులో భర్త నిర్దోషి

 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తీర్పు 

సీరియల్‌ నటి చిత్ర ఆత్మహత్య వ్యవహారం గతంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టులో సాగిన క్రమంలో చిత్ర భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. వివరాలు.. వెండితెర నటి చిత్ర 2020 డిసెంబర్‌ 9న పూందమల్లి సమీపంలోని నసరత్‌పేట వద్ద వున్న ప్రైవేటు రిసార్ట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 చిత్ర ఆత్మహత్యకు ఆయన భర్త హేమనాఽథ్‌దే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన క్రమంలో అప్పట్లో శ్రీపెరంబదూరు ఆర్డీవో దివ్యశ్రీ విచారణ చేపట్టి నివేదికను కోర్టుకు సమర్పించారు. కాగా చిత్ర ఆత్మహత్య వ్యవహరంలో ఆమె భర్త హేమనాథ్‌ సహా పలువురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించగా మూడు నెలల తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు విచారణ తిరువళ్లూరు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో నాలుగేళ్లుగా సాగుతోంది.

 అయితే కోర్టులో కేసు విచారణ ఆలస్యంగా సాగుతుందని విచారణను త్వరగా పూర్తి చేసేలా తిరువళ్లూరు కోర్టును ఆదేశించాలని కోరుతూ చిత్ర తండ్రి కామరాజ్‌ హైకోర్టులో ప్రత్యేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సాగించిన హైకోర్టు ఆరునెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని జిల్లా కోర్టును ఆదేశించింది. దీంతో తిరువళ్లూరు జిల్లా మహిళా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణలో వేగం పెంచింది.

 మొత్తం 56 మంది సాక్షులను విచారించింది. విచారణ పూర్త యిన క్రమంలో చిత్ర ఆత్మహత్య చేసుకునేలా భర్త హేమనాథ్‌ ప్రేరేపించారని సెక్షన్‌ 498ఏ, 306 కింద పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హేమనాఽథ్‌కు వ్యతిరేకంగా పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోయారని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి రేవతి, కేసు నుంచి అతడికి విముక్తి కల్పిస్తూ తీర్పు వెలువరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement