తిరుపతి కల్చరల్ : ఆరోగ్య రక్షణకు ఔషధాలు అవసరమని, అలాగే ఔషధ రంగంలో ఫార్మసిస్టులు కీలకమని పలువురు వైద్య ప్రముఖులు వెల్లడించారు. బుధవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం నిర్వహించారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు జి.సుభాషిణి, ఎం.రూతు, పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి.రంగనాయకులు, మహిళావర్సిటీ ప్రొఫెసర్ నాగరాజు, కృష్ణతేజ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వేణుగోపాల్, మోహన్బాబు వర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ బీపీ మల్లికార్జున ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రపంచ జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. అయితే వైద్యుల కంటే రోగులకు ఫార్మసిస్టుల సేవలే అవసరంగా మారాయని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువతకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫార్మసీ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత మెడికల్షాపు యజమాన్యాలకు సర్టిఫికెట్లు అమ్ముకోవడం నేరమన్నారు. అంకాలజీడయాబెటీస్ రంగాల్లో ఫార్మసిస్టులు పెరగాలని కోరారు. కార్యక్రమంలో విష్వక్సేన మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత కందూరి జనార్ధన్, రిటైర్డ్ సీనియర్ ఫార్మసిస్ట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఫార్మసిస్ట్లు బాలరాజు నాయుడు, పి.నాధముని, డాక్టర్ సింగమాల సుమన్, సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఎం.ధనుష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment