ఉపాధ్యాయులపై పని భారం తగ్గించండి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులపై పని భారం తగ్గించండి

Published Sun, Oct 20 2024 2:16 AM | Last Updated on Sun, Oct 20 2024 2:16 AM

-

తిరుపతి కల్చరల్‌: ఉపాధ్యాయులపై పనిభారాన్ని తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.రామమూర్తి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతిరోజూ ఏదో ఒక విషయాన్ని తెలిపి ఆ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వెంటనే అప్‌డేట్‌ చేయాలని చెబుతుండడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు. తద్వారా పిల్లలకు విద్యాబోధన కష్టంగా మారిందని వెల్లడించారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేయలేకపోతున్నారని, ఇచ్చిన సమాచారం కూడా అస్పష్టంగా ఉండడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇచ్చిన సమాచారాన్ని సెల్‌ఫోన్‌ ద్వారా ఆప్‌లోడ్‌ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నా య మార్గాల ద్వారా సమాచా రాన్ని సేకరించుకోవాల సూచించారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పని ఒత్తిడిలో చదువుపై శ్రద్ధ చూపలేరని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement